ప్రస్టేటెడ్ భర్త : పెళ్లాం చికెన్ వండలేదని.. కూతుర్ని కొట్టాడు..

ప్రస్టేటెడ్ భర్త : పెళ్లాం చికెన్ వండలేదని.. కూతుర్ని కొట్టాడు..

భార్యపై కోపం..తట్టుకోలేని ప్రస్టేషన్..అతడు ఏం చేస్తున్నాడో అతనియే తెలియని పరిస్థితి.భోజనంలోకి చికెన్ వండలేదని కోపంతో భార్యపై ఉన్న కోపాన్ని కూతురిపై చూపించాడు. భార్యపై పీకల్లోతు కోపంతో కూతురిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తీవ్రగాయాలతో ఆ బాలికను ఆస్పత్రిలో చేర్చారు బంధువులు. వివరాల్లోకి వెళితే.. 

మహారాష్ట్రలోని పుణెలో సమీపంలోని పాషాన్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.  పాషాన్ ప్రాంతంలో నివాసముంటున్న వికాస్ నాగనాథ్ రాథోడ్.. భార్య బిడ్డలతో నివాసం ఉంటున్నాడు. నవంబర్ 27న కూతురిపై ఇటుకతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడని  చతుర్ శృంగి పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి ఇంటికి తిరిగొచ్చిన రాథోడ్..చికెన్ వండలేదని భార్యపై కోపోద్రోక్తుడయ్యాడు. భార్యపై కోపం బిడ్డపై చూపించాడు. తన చిన్నారి కూతురిపై ఇటుకతో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత రాథోడ్ పరారయ్యడు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు వికాస్ రాథోడ్ కోసం గాలిస్తున్నారు. అయితే చికెన్ వండలేదని మాత్రమే దాడి చేశాడా లేక మరేదైన కారణంగా ఉందా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత ప్రస్టేషన్ ఉంటే మాత్రం ఇలా కన్న బిడ్డలపై దాడి చేస్తారా.. అని ఇది విన్నవారు విసుక్కుంటున్నారు.