రాజ్యసభకు వద్దిరాజు, అనిల్‌‌ ఎన్నిక ఏకగ్రీవం

రాజ్యసభకు వద్దిరాజు, అనిల్‌‌ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇరువురు నాయకులు తమ అభిమానులతో మంగళవారం అసెంబ్లీ చేరుకున్నారు. ఎన్నికల అధికారి నుంచి తమ విజయ ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌‌‌‌కు వద్దిరాజు కృతజ్ఞతలు తెలిపారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానన్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత, అసెంబ్లీ నుంచి గాంధీభవన్‌‌కు అనిల్ కుమార్ యాదవ్ ర్యాలీగా వెళ్లారు. రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఎన్నికల ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంది.