ట్రీట్​మెంట్​ ఇస్తూ..గుండెపోటుతో కుప్పకూలిన ఏఎన్ఎం

ట్రీట్​మెంట్​ ఇస్తూ..గుండెపోటుతో కుప్పకూలిన ఏఎన్ఎం
  •  డాక్టర్స్​డే రోజు మహబూబ్​నగర్ ​జిల్లాలో విషాదం 

నవాబుపేట, వెలుగు: నేషనల్​ డాక్టర్స్​ డే రోజు మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట పీహెచ్​సీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఏఎన్ఎం గుండెపోటుతో కన్నుమూసింది. మహబూబ్​నగర్​కు చెందిన  కృష్ణవేణి(35) మండలంలోని రుద్రారం సబ్​సెంటర్​లో ఔట్​ సోర్సింగ్​లో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్​ సెంటర్​లో ఓపీ విభాగంలో రోగులకు వైద్య సేవలు అందిస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే క్యాబిన్​లో ఉన్న డాక్టర్​ నరేశ్​ చంద్ర వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతూ అక్కడే కుప్పకూలిపోయింది.

 వెంటనే డాక్టర్, సిబ్బంది సీపీఆర్​ చేశారు. అప్పటికే పల్స్​రేట్​ పూర్తిగా పడిపోవడంతో అంబులెన్స్​లో ఎస్​వీఎస్​ హాస్పిటల్​కు  తరలించారు. అయితే, కృష్ణవేణి అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మధ్యాహ్నం పీహెచ్​సీ సిబ్బంది అంతా కలిసి డాక్టర్స్​ డేను సెలబ్రేట్​ చేసుకోవాలని అనుకున్నామని, తమ కండ్ల ముందే ఏఎన్ఎం కృష్ణవేణి చనిపోవడం కలచివేసిందని డాక్టర్​ నరేశ్​చంద్ర తెలిపారు. పై అధికారులతో మాట్లాడి మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన చెప్పారు.డ