హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సేవలు అందించే వన్ ఫైనాన్స్ సంస్థ, అనూజ్ మెహతాకు పార్టనర్గా ప్రమోషన్ఇచ్చింది. ఈ సంస్థ రూ.17 వేల కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది. ఫైనాన్షియల్ ప్లానర్ల సేవలను విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అనుజ్ గతంలో వైస్– ప్రెసిడెంట్గా పనిచేశారు.
ఆయనకు ఆర్థిక సలహా, రిస్క్ మేనేజ్మెంట్లో పదేళ్ల అనుభవం ఉంది. కేపీఎంజీ, క్రెడిట్ సూయిజ్లోనూ పనిచేశారు. ఇక నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్, సెంటర్ నెట్వర్క్ను విస్తరించడంపై దృష్టి పెడతారని, దక్షిణాది కంపెనీ వృద్ధికి ఈ నిర్ణయం మరింత దోహదపడుతుందని వన్ఫైనాన్స్ తెలిపింది.
