హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో ఘర్షణల వంటి భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నా, మన ఎకానమీ బలంగా ఉందని ప్రభుదాస్ లీలాధర్(పీఎల్) అసెట్ మేనేజ్మెంట్ తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది. దీని ప్రకారం.. చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నా కంపెనీల బలమైన ఆదాయాలు, క్రెడిట్ వృద్ధి మార్కెట్లకు మద్దతు ఇస్తున్నాయి.
దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 37 నెలల్లో షేర్లు కొని రికార్డు సృష్టించారు. ఎఫ్ఐఐలు సైతం తిరిగి వస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి.
మొదటి క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు, కంపెనీల ప్రతిషేరు ఆదాయం (ఈపీఎస్) మెరుగ్గా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.3 శాతానికి చేరుకోగా, బ్యాంకు క్రెడిట్ విస్తరణ 17.7 శాతంగా నమోదైంది. జీఎస్టీ వసూళ్లు సైతం గరిష్ట స్థాయికి చేరాయని పీఎల్ రిపోర్ట్ వివరించింది.
