హైదరాబాద్లో ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్.. తొలిదశ పెట్టుబడి రూ.76 వేల400 కోట్లు

హైదరాబాద్లో ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్.. తొలిదశ పెట్టుబడి రూ.76 వేల400 కోట్లు

హైదరాబాద్, వెలుగు: గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో​కు చెందిన ఏఎం ఇంటెలిజెన్స్ ఆసియాలోనే మొట్టమొదటి ఎన్విడియా వెరా రూబిన్ ఏఐ క్లస్టర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 9,000 ఎన్విడియా రూబిన్ జీపీయూలను ఆర్డర్​చేసింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఏఐ ఫ్యాక్టరీ 2027 మొదటి క్వార్టర్లో అందుబాటులోకి రానుంది.

తొలి దశలో 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎనిమిది బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.76,400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. విద్యుత్ మౌలిక సదుపాయాలను ఏఐ కంప్యూట్‌‌‌‌‌‌‌‌గా మార్చడంలో ఈ ప్రాజెక్టు కీలకమని ఏఎంఐ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు.

అత్యంత సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను సమర్థవంతంగా నడపడానికి వెరా రూబిన్ ఆర్కిటెక్చర్ భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో భారత్, అమెరికా, యూరప్​లో ఐదు గిగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని ఏఎంఐ లక్ష్యంగా పెట్టుకుంది. అత్యంత పెద్ద, సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుందని అనిల్​ తెలిపారు.