ఏపీలో 2 రోజులు సంతాప దినాలు

ఏపీలో 2 రోజులు సంతాప దినాలు

అమరావతి: రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా  కొత్త కార్యక్రమాల భూమి పూజ, ప్రారంభోత్సవాలు వాయిదా వేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.