సెప్టెంబర్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ

సెప్టెంబర్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ

విజయవాడ: వచ్చేనెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ అనుమతితోనే నోట్ ఫైల్ రెడీ అయినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. పలు కీలక నిర్ణయాలు  తీసుకుని వాటి ఆమోదం కోసం క్యాబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణతో నీటి వివాదాలు.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు కానందున వాటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే ముందు క్యాబినెట్ భేటీ నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే కేబినెట్ సమావేశంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని తెలుస్తోంది. సీఎంవో అధికారులు మాత్రం రోటీన్ గా జరిగే సమావేశమే.. ఎలాంటి ప్రత్యేకత లేదంటున్నారు. 3వ తేదీన వెలగపూడిలోని సచివాలయంలో  క్యాబినెట్ భేటీ జరపాలని నిర్ణయించింది నిజమే.. ఆ రోజు వరకు ఉన్న పరిస్థితులు.. అంటే జలవివాదాలు కావచ్చు.. లేదా మరే పెండింగ్  అంశమైనా సరే ప్రాముఖ్యతను బట్టి ఆయా అంశాలపై చర్చించి.. క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరుగుతుందని వివరించారు.