ఇంటికే రేష‌న్.. ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

ఇంటికే రేష‌న్.. ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

అమ‌రావ‌తి: బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ డోర్ డెలివరీల కోసం 9,260 వాహనాలను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం నుంచి వైసీపీ ప్రభుత్వం ఈ రేషన్‌ సరకులను మినీ వ్యాన్‌ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. స్వయం ఉపాధి పధకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు.. ఈ బియ్యం ఇంటింటికీ డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. కాగా, ఈ వాహనాలకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పది శాతం డబ్బును చెల్లించి యువత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నాణ్యమైన బిబియ్యాన్నిఅందరికీ అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కారు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.