గుంటూరు కారం టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

గుంటూరు కారం టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ఈ మూవీ సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్రయూనిట్.. తమ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. మేకర్స్ రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందిస్తూ.. గుంటూరు కారం టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్ని థియేటర్లలో టికెట్ పై రూ.50 రూపాయలుపెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 12 నుంచి పది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ కూడా ఈ సినిమా టికెట్ ధరలపెంపుకు, బెనిఫిట్ షోలకు ఇప్పటికే అనుమతిచ్చింది. 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతివ్వడంతో గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడుచూద్దామా అన్నట్లు అభిమానులు ఎదురుచుస్తున్నారు. థియేటర్లలో రచ్చ చేసేందుకు ఫ్యాన్స్  సిద్ధమయ్యారు.