హైదరాబాద్, వెలుగు: కృష్ణాలో నీటి వినియోగంపై ఏపీ మరోసారి తన వంకరబుద్ధిని చాటుకుంది. కామన్ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లలో ఎక్కువ వాటా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఏపీ ఇండెంట్ పెడుతూ లేఖ రాసింది. ప్రస్తుతం నాగార్జునసాగర్లో153 టీఎంసీలు, శ్రీశైలంలో 184 టీఎంసీల నీళ్లున్నాయని లేఖలో పేర్కొంది.
అందులో డెడ్స్టోరేజ్కు ఎగువన ఉన్న నీళ్లలో 70 శాతం తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో తెలంగాణకు మాత్రం 30 శాతం పంచాలని లేఖలో బోర్డును కోరింది. అయితే, ఆ నీటిని సాగు అవసరాల కోసం కాకుండా కేవలం తాగునీటి కోసమే వినియోగించుకునేలా చూడాలని కోరింది. కాగా, గురువారం త్రీమెన్కమిటీ మీటింగ్ను నిర్వహించాల్సి ఉన్నా.. ఇరు రాష్ట్రాల ఈఎన్సీల అభ్యర్థన మేరకు మీటింగ్ను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
