యాపిల్ చైనా కంటే ముందే భారత్లో ఐఫోన్ 17 తయారీ

యాపిల్ చైనా కంటే ముందే భారత్లో ఐఫోన్ 17 తయారీ

భారత్ యాపిల్ ఐఫోన్ 17 తయారీకి సిద్ధమవుతోంది. Apple  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతీయ కంపెనీల్లో iPhone17 ను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తోంది. చైనా వెలుపల ఐఫోన్ తయారీ ప్రక్రియను చేపట్టడం ఇదే తొలిసారి. 

2025లో  భారత్ లో యాపిల్ తన కొత్త  ఉత్పత్తులను ప్రారంభించబోతోంది. ఇది చైనీస్ డెవలప్ మెంట్ సైట్ నుంచి నిష్క్రమణను సూచిస్తుంది. గ్లోబల్ ప్రొడక్షన్ ల్యాండ్ స్కేప్ లో భారత్ కు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. 
అంతేకాకుండా భారత్ కు చెందిన ప్రముఖ కంపెనీ టాటాను యాపిల్ ఐఫోన్ 17 అసెంబ్లర్ గా చేర్చుకోవడం ద్వారా మన దేశంతో బలమైన సంబంధాలను పెంపొందించుకుంటోంది. ఇటీవల టాటా కంపెనీ భారత్ విస్ట్రోన్ ఐఫోన్ ఉత్పత్తి లైన్లను కొనుగోలు చేసింది. ఇది భారత్తో యాపిల్ సంబంధాన్ని పటిష్టం చేసుకోవడం, భవిష్యత్  కోసం వ్యూహాత్మక ప్రాముఖ్యతను చెపుతోంది. ఇందులో భాగంగా భారత్ లో ఐఫోన్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి సిద్దంగా ఉంది. ఇది రాబోయే దశాబ్దం యాపిల్ వ్యూహంలో కీలక అంశం. ఉత్పత్తిలో మార్పు, సాంకేతికత తయారీలో గ్లోబల్ రీలైన్ మెంట్ ను సూచిస్తుంది. 

భారత్ లో ఐఫోన్ ఉత్పత్తి  విస్తరణ, చైనాలోని జెంగ్‌జౌ, తైయువాన్‌లలో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి సామర్థ్యం వరుసగా 35–45 శాతం, 75–85 శాతం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఆర్డర్‌ల కేటాయింపులు పెరగడంతో సహా అనేక అంశాలు ఈ మార్పుకు దోహదం చేస్తాయి. 

ALSO READ :- భారత్లో యాపిల్ ఆదాయం రూ.50వేల కోట్లు..