హైదరాబాద్: తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సెట్)లకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఆయా సెట్లను నిర్వహించే వర్సిటీల వివరాలనూ వెల్లడించింది. టీఎస్ఈఏపీసెట్, పీజీఈసెట్ లను జేఎన్టీయూకు, ఐసెట్ కాకతీయకు, ఈసెట్, లాసెట్ లను ఉస్మానియాకు, ఎడ్ సెట్ మహాత్మాగాంధీ వర్సిటీకి, పీఈసెట్ ను శాతవాహన వర్సిటీకి కేటాయించింది.
ఈఏపీసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ దీన్ కుమార్ను, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్ను ఈసెట్ కన్వీనర్గా, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్ విజయలక్ష్మిని లాసెట్ కన్వీనర్గా నియమించారు. పీజీఈసెట్ కన్వీనర్ గా అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్ గా నరసింహాచారి. పీఈసెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ నియమితులయ్యారు.