ఏప్రిల్ 9కి ఓ చరిత్ర ఉంది.. అందుకే ఆ రోజు సభ పెడుతున్నాం

ఏప్రిల్ 9కి ఓ చరిత్ర ఉంది.. అందుకే ఆ రోజు సభ పెడుతున్నాం

ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే సంకల్ప సభకు సంబందించిన జెండా మరియు పోస్టర్‌ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. గత ఫిబ్రవరి 9 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర పాలన, ఇక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నానని ఆమె అన్నారు. ‘రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాతో ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఇది. రాజన్న సంక్షేమ పాలన దిశగా వెళ్లేందుకు ఏప్రిల్ 9న ఖమ్మంలో మొదటి సభ నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 9న వైఎస్ఆర్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజు. అందుకే ఆ రోజు సభ పెడుతున్నాం. ఎవరూ భయపడోద్దు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ పార్టీనే. మనకు ఎవరి పొత్తు అవసరం లేదు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చెప్తే వచ్చిన వాళ్ళం కాదు’ అని షర్మిల అన్నారు.