
మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో ‘అప్సర రాణి’ ప్రధాన పాత్రలో ‘తలకోన’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గురువారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ‘గుర్తుందా శీతాకాలం’ నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా... ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. ఈ రోజే చిత్రాన్ని ప్రారంభించినట్లు.. 'తలకోన' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని 'తలకోన' చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి వెల్లడించారు. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందన్నారు. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుందన్నారు. ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేశినట్లు తెలిపారు.
‘తలకోన ఫారెస్ట్ లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు ? ఎంతమంది తిరిగొచ్చారు ? అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గా రూపొందిస్తున్నాము. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రానుంది. ఈ తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్ లో మరో 20 రోజులు తలకొనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాము’ అని తెలిపారు. తలకోన చిత్రం మంచి స్క్రిప్ట్స్ తో ఉందని.. ఈ సినిమా చేయడానికి కారణం అదేనని హీరోయిన్ అప్సర రాణి తెలిపారు. మొదటి నుంచి మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటానని, ఇవే తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయన్నారు. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
నటీనటులు : అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, సుభాష్, రాజా రాయ్ తదితరులు