నిజామాబాద్, వెలుగు: ఫారెస్ట్ ల్యాండ్ రక్షణ, పచ్చదనం, పర్యావరణం పెంచడంతో పాటు ప్రజలకు అహ్లదకర వాతావరణం కల్పించడానికి అరణ్య ఎకో పార్క్ రెడీ అయింది. నిజామాబాద్ నగర శివారులోని మాక్లూర్ మండలంలోగల 476.30 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లో డెవలప్ చేసిన ఈ పార్క్ను గురువారం సీఎం రేవంత్రెడ్డి వనమహోత్సవం- 2026లో భాగంగా వర్చువల్ మోడ్లో ఓపెనింగ్ చేయనున్నారు.
దీని కోసం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వర్చువల్మోడ్లో ఓపెనింగ్ చేశాక పూర్తి స్థాయిలో అరణ్య అర్బన్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
