రేవంత్ ఛార్జ్ తీసుకునేలోపు గాంధీ‌భవన్‌లో వాస్తుమార్పులు

రేవంత్ ఛార్జ్ తీసుకునేలోపు గాంధీ‌భవన్‌లో వాస్తుమార్పులు

గాంధీ‌భవన్‌లో వాస్తుమార్పులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు శ్రీకారం చుట్టారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ‌గా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో.. గాంధీ‌భవన్‌లో వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం గాంధీ‌భవన్‌ను వాస్తు నిపుణులు, వేదపండితులు పరిశీలిస్తున్నారు. గాంధీ‌భవన్‌లో ఎంట్రీ పాయింట్‌ను మార్చాలని పార్టీ కొత్త కమిటీ నేతలు సూచించారు. గాంధీ‌భవన్ క్యాంటీన్ పక్కన ఉన్న పాత గేట్ నుంచి ఎంట్రెన్స్‌ను ఏర్పాట్లు చేస్తున్నారు. 
గాంధీభవన్‌లో పార్టీ జెండాలు అమ్మే రూమ్, సెక్యూరిటీ రూంలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. గాంధీభవన్‌లో తూర్పు దిక్కున ఈశాన్యం వైపు ఎలాంటి బరువు ఉండకుండా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీభవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా.. కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా  నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కొత్తకమిటీ సభ్యులు భావిస్తున్నారు. రేవంత్ పీసీసీగా ఛార్జ్ తీసుకున్న తరువాత పాత గేట్ నుంచి గాంధీభవన్ లోపలికి వచ్చి.. కొత్త గేట్ నుంచి వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీభవన్‌లో వాస్తుమార్పులు చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.