‘అర్జున ఫల్గుణ’పై నమ్మకముంది

‘అర్జున ఫల్గుణ’పై నమ్మకముంది

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని రూపొందించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో దిల్ రాజు మాట్లాడుతూ ‘నాలాగే ఈ చిత్ర నిర్మాతలు కూడా కొత్త దర్శకులతో వర్క్ చేస్తున్నారు. మనం ఎన్ని విజయాలు సాధిస్తామో తెలీదు కానీ, ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే సక్సెస్ కచ్చితంగా వస్తుంది. ఈ మూవీ విషయంలో నాకా నమ్మకం ఉంది. పాత్ర ఎలాంటిదైనా శ్రీవిష్ణు తనదైన పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌తో మెప్పిస్తాడు’ అని చెప్పారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘షూట్ మొత్తం గోదావరి జిల్లాల్లోనే చేశాం. చూశాక అందరూ ‘ఇదిరా మా గోదావరి జిల్లాల గొప్పదనం’ అని కాలర్ ఎగరేస్తారు.  ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది’ అన్నాడు. స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మా తలకు థ్యాంక్స్ చెప్పింది అమృత. ‘కొత్త డైరెక్టర్లకు శ్రీవిష్ణు ధైర్యాన్నిస్తాడు. ఆ ధైర్యమే నన్నిక్కడ నిలబెట్టింది’ అన్నాడు తేజ. దర్శకులు హసిత్ గోలి, కిశోర్ తిరుమల, వివేక్ ఆత్రేయ, వెంకటేష్‌‌‌‌‌‌‌‌ మహా, సాగర్ కె చంద్ర, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ పాల్గొన్నారు.