కశ్మీర్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్మీ పెట్రోలింగ్

కశ్మీర్లో  ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్మీ పెట్రోలింగ్

జమ్మూ కశ్మీర్ లోని ఉరి సెక్టార్ లో సరిహద్దులో ఆర్మీ సిబ్బంది పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. చలి తీవ్రత , చలి గాలుల ప్రభావం అధికంగా ఉన్నప్పటికి పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సైనికులు చెబుతున్నారు. 

తీవ్రమైన పొగమంచు ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మలచుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం ఉందనే అనుమానంతో ఆర్మీ పెట్రోలింగ్ కొనసాగిస్తున్నామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. దేశంలోకి అక్రమంగా ఎలాంటి చొరబాటు జరగకుండా చూడడమే తమ  పెట్రోలింగ్ లక్ష్యమని చెప్పారు. పొగమంచు కారణంగా మరింత అప్రమత్తంగా ఉన్నామంటున్నారు ఆర్మీ సిబ్బంది.