ఉద్దవ్ ఠాక్రే చేసిన తప్పేంటో ధైర్యంగా చెప్పాలి

ఉద్దవ్ ఠాక్రే చేసిన తప్పేంటో ధైర్యంగా చెప్పాలి

రెబల్ ఎమ్మెల్యేలు తమని తాము అమ్ముకున్నారని శివసేన నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. వాళ్లు రెబల్స్ కాదని ద్రోహులని.. ఇలాంటి వాళ్లు మళ్లీ ఎప్పటికి గెలవలేరని విమర్శించారు. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంలో గెలుస్తామన్న నమ్మకం తనకుందన్నారు. చెత్త అంత బయటకి వెళ్లినందుకు సంతోషంగా ఉందని..తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాల్సిందన్నారు. ఉద్దవ్ ఠాక్రే చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలన్నారు.

తమతో 15-16 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..రెబల్ ఎమ్మెల్యేలు ఎప్పుడు తిరిగి వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఫ్లోర్ టెస్టుకు ముందు ఎమ్మెల్యేలకు నైతికత పరీక్ష పెట్టాలన్నారు. ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ వద్ద ఆర్మీ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయని..ఆ బలగాలను కశ్మీరీ పండిట్ల రక్షణ కోసం వినియోగించాలని అన్నారు.