
- చైనా నుంచి ఇంజినీర్లు రావాల్సి ఉంది
- ఆగస్టులో సీఎం చేతుల మీదుగా వైరా రిజర్వాయర్కు నీటి తరలింపు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం/ముల్కలపల్లి/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ పనులు స్పీడప్ చేశామని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మోటార్ల ట్రయల్ రన్ కోసం చైనాలోని షాంఘై నుంచి ఇంజినీర్లు రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెంలోని పంప్హౌజ్ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇరిగేషన్ శాఖ సలహాదారు పెంటారెడ్డితో, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్రాజ్, ఐటీడీఏ పీవో రాహూతో కలిసి మంగళవారం సందర్శించి మోటార్లను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్కు సంబంధించిన పనుల వివరాలను ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.
ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయో గుర్తించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్కు సంబంధించిన మోటార్లను చైనాలోని షాంఘై కంపెనీని నుంచి తెప్పించారని, ఇప్పుడు ట్రయల్ రన్ నిర్వహించాలంటే అక్కడి నుంచి ఇంజినీర్లు రావాల్సి ఉందన్నారు. వారి రాక కోసం భారత విదేశాంగ శాఖ, ఎంబసీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
నాలుగైదు రోజుల్లో వారు వచ్చే అవకాశం ఉందన్నారు. పూసుగూడెం, కమలాపురం ప్రాంతాల్లోని పంప్హౌజ్లలోనూ నెలాఖరు నాటికి ట్రయల్ రన్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్త్యయేలోపు గోదావరి జలాలను వాడుకుంటూ పంప్ హౌజ్లను పూర్తి స్థాయిలో తీసుకు వస్తామన్నారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు గోదావరి నీళ్లు ఇస్తామని చెప్పారు. ఆయన వెంట ఇరిగేషన్ సీఈ ఎ. శ్రీనివాస్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. సురేశ్కుమార్ ఉన్నారు.
ఆగస్ట్లో సీఎం రాక
గోదావరి నీళ్లను ఏన్కూర్ లింక్ కెనాల ద్వారా వైరా ప్రాజెక్ట్లోకి మళ్లించే ప్రక్రియకు సీఎం రేవంత్రెడ్డి ఆగస్ట్లో శ్రీకారం చుట్టనున్నారని మంత్రి చెప్పారు. కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో రాకపోయినా ఎన్ఎస్పీ, వైరా, లంక సాగర్ ప్రాజెక్ట్ల కింద ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇవ్వొచ్చన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తూ పనులు చేస్తున్నామన్నారు. హెడ్ వర్క్స్ నుంచి టన్నెల్ వరకు మొత్తం 104 కిలోమీటర్ల కెనాల్ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయన్నారు.