ఏఐ ఇంజినీరింగ్​లో వెయ్యి జాబ్స్

ఏఐ ఇంజినీరింగ్​లో వెయ్యి జాబ్స్

 న్యూఢిల్లీ:  మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌‌‌‌హాల్ (ఎంఆర్​ఓ) సామర్థ్యాలను బలోపేతం చేయడానికి,  అప్‌‌‌‌గ్రేడ్ చేయడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ రాబోయే నెలల్లో వెయ్యి మందిని తీసుకోనుంది.   మొత్తం సిబ్బంది సంఖ్యను 6,000 కి చేర్చనుంది. ఎంఆర్ఓ స్పేస్‌‌‌‌లో మొదటిస్థానంలో ఉన్న ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్​ఎల్) గత మూడేళ్లలో  సగటున రూ. 2,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది. విస్తరణ కోసం మరిన్ని నిధులను పొందాలని చూస్తోంది.  

 భారతదేశంలో విమానయాన వృద్ధికి మద్దతుగా, రాబోయే నెలల్లో మరో 1,000 మందిని నియమించుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు కంపెనీ సీఈఓ శరద్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్/ఇంజన్ రకాలను చేర్చడానికి సామర్థ్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందని  చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటని అన్నారు. 

 పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్  వల్ల విమానయాన సంస్థలు తమ విమానాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నందున, ఎంఆర్​ఓ సేవలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఏఐఈఎస్ఎల్ బేస్  లైన్ మెయింటెనెన్స్‌‌‌‌తో పాటు ల్యాండింగ్ గేర్  సహా అనేక సేవలను అందిస్తుంది. గత సంవత్సరం ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత ఏఐఈఎస్​ఎల్​ ఇప్పుడు ఏఐ అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ అధీనంలోకి వచ్చింది. ఇది​ గత మూడేళ్లలో సంవత్సరానికి సగటున రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.