జైల్లో మంత్రికి చేసింది మసాజ్ కాదు ఫిజియోథెరపీ: కేజ్రీవాల్

జైల్లో మంత్రికి చేసింది మసాజ్ కాదు ఫిజియోథెరపీ: కేజ్రీవాల్

ఆప్‌ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ వీడియోపై ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. జైల్లో మంత్రి సత్యేంద్ర జైన్ కు మసాజ్, వీఐపీ ట్రీట్‌మెంట్ చేయించారని అంటున్నారని, కానీ.. అది ఫిజియోథెరపీ మాత్రమే అని చెప్పారు. 

సత్యేంద్ర జైన్‌కు రెండు వెన్నెముక శస్త్రచికిత్సలు జరిగినందున ఫిజియోథెరపీ తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ ఎన్నికలలో పైచేయి సాధించేందుకు జైన్ అనారోగ్యాన్ని అపహాస్యం చేయడానికి ఇవి బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లో జైలుకెళ్లినప్పుడు వీఐపీ ట్రీట్‌మెంట్ పొందారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక మనీలాండరింగ్ కేసులో  మే 30  సత్యేంద్రజైన్ అరెస్ట్ అయ్యారు.