డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్న తమిళ హీరో ఆర్య.. త్వరలో ‘ది విలేజ్’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘గృహం’ అనే థ్రిల్లర్తో మెప్పించిన మిలింద్ రావ్ దీనికి దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్తో ఆకట్టుకున్న టీమ్.. శుక్రవారం ట్రైలర్ను విడుదల చేశారు.
తన కుటుంబంతో కలిసి ఆర్య రోడ్ ట్రిప్కు వెళుతుండగా ఆ వెహికిల్ ఆగిపోతుంది. దాంతో దగ్గరలో ఉన్న ఓ గ్రామానికి వెళతాడు. అక్కడ వింత జంతువుల వల్ల అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో ఎలాంటి సాహసాలు చేశాడనేది మెయిన్ కాన్సెప్ట్. మొత్తానికి ట్రైలర్ ఇంటరెస్టింగ్గా ఉంది. ఈనెల 24 నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.