నల్గొండ జిల్లాల్లో ఘనంగా సురక్ష దివస్

నల్గొండ  జిల్లాల్లో ఘనంగా  సురక్ష దివస్

నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో  భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. నల్గొండ ఎస్పీ కె. అపూర్వ రావు అధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ తీశారు. జిల్లా పోలీస్ ఆఫీస్​ నుంచి వాహన ర్యాలీని జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి, కలెక్టర్​ టి. వినయ్​కృష్ణారెడ్డి, ఎస్పీ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్​ కళాజాత ఆధ్వర్యంలో షీటీమ్​, పోలీసుల పనితీరుపై పాటల రూపంలో వినిపించారు. ర్యాలీలో దాదాపు 1000 మంది సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.  సాయంత్రం   సమావేశంలో మంత్రి జగదీశ్​ రెడ్డి పాల్గొన్నారు.  సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

సూర్యాపేట : యావత్ భారతదేశంలో ఫ్రెండ్లీ  పోలీస్ ఉన్నది తెలంగాణాలోనే అని మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో జరిగిన కార్యక్రమానికి ఉదయం హాజరయ్యారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ , డీఎస్పీ నాగభూషణం పాల్గొన్నారు. కొత్త బస్ స్టాండ్ నుంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు పోలీస్ లు ర్యాలీ తీశారు. 

యాదాద్రి :  భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్ల జాతీయ జెండాతో కలెక్టరేట్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు.  కలెక్టరేట్ లో  పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్​ చంద్ర, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సన్మానించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్పీ నవీన్ కుమార్, ఏఓ నాగేశ్వర చారి, పోలీస్ , ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.