రాబోయే రోజుల్లో BJP, RSS కు దేశ ప్రజలే సమాధానం చెప్తారు

రాబోయే రోజుల్లో BJP, RSS కు దేశ ప్రజలే సమాధానం చెప్తారు

NRC,CAA,NPRలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హైదరాబాద్ లో చాలా రోజుల నుండి  NRC,CAA,NPR కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్ట్ లో ఈ చట్టాలపై కేసు వేశామన్న ఆయన .. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతూనే ఉంటా..అందరి కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ముస్లింల పై కేంద్ర ప్రభుత్వం తమ ప్రతాపాన్ని చూపిస్తుందన్నారు. ఎన్ని కుట్రలు చేసిన..ఎంత మంది మీద కేంద్ర ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపించినా..రాబోయే రోజుల్లో BJP,RSS కు బలమైన సమాధానం దేశ ప్రజలు ఇస్తారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.