ద్వారకా తిరుమలలో ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు

ద్వారకా తిరుమలలో ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజులపాటు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను పెళ్లికొడుకు, పెళ్లి కూతుర్లుగా ముస్తాబు చేశారు. ఈనె 30వ తేదీన స్వామివారి కళ్యాణం జరగుతుంది. కళ్యాణోత్సవాలు ప్రారంభమైన నేపధ్యంలో స్వామి వారి నిత్య కళ్యాణాలు, నిత్య ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నామని..  భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.