
తెలుగు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ, టీవీ యాంకర్ ఓంకార్ (Omkar).ప్రముఖ టెలివిజన్ షోలను నిర్మించి, హోస్ట్ చేయడంలో సక్సెస్ ఫుల్ అయ్యారు. తాజాగా ఆయన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్లుక్, టీజర్తో అందరి దృష్టిని ఆకర్షించాడు అశ్విన్. ఈ సినిమా వచ్చే నెల ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.
శివం భజే అని ఈ సినిమాకు ఆధ్యాత్మికమైన టైటిల్ను పెట్టినా..వరుస హత్యలతో, టెర్రరిజం ఆగడాల నేపథ్యంలో ట్రైలర్ అదిరిపోయింది. వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగు అయిపోవాలి' అంటూ 'శివం భజే' ట్రైలర్ స్టార్టింగ్ లో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించగా..ఆ వెంటనే తీవ్రవాదుల్ని చూపించారు. ఇక ఆ పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటు డ్రాగన్ దేశానికి చెందిన అధికారులను కూడా ట్రైలర్ లో చూపించడంతో అసలు చైనా పాత్ర ఏమిటి? అనేది ట్రైలర్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
అలాగే వరుస హత్యలతో మరో క్రైమ్ యాంగిల్ చూపించడంతో ట్రైలర్ మరో యూ టర్న్ తీసుకుంది. 'ఈ మధ్య మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు' అని హీరోయిన్ దిగంగనా చెప్పడం..'చంపే చెయ్యి కనిపిస్తుంది గానీ చంపింది ఎవరో తెలియడం లేదు' అని హీరో చెప్పడం చూస్తుంటే ఆయన మీద అనుమానం కలిగించేలా ఉంది.
Also Read :- కంగువఫైర్ సాంగ్ బీభత్సం
గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సోదరుడు అర్పాజ్ ఖాన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు అర్పాజ్ ఖాన్. ఆ తర్వాత 2017లో రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో విలన్ గా నటించాడు.
అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ తో పాటుగా, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.