
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఢిల్లీలో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ లో అశ్విన్ రికార్డు సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100 వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అలెక్స్ కారీని అవుట్ చేయడంతో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. తొలిస్థానంలో టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే 111 వికెట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిరోజు ఆటలో భాగంగా ఆసీస్ ఇప్పటివరకు 8 వికెట్లను కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో నాథన్ లియాన్ (1), పీటర్ హ్యాండ్స్కాంబ్ (59)పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.