జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్లోకి దూరి మెషీన్ను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన వేణు నందు (43) మంగళవారం అర్ధరాత్రి జూబ్లీచెక్పోస్ట్సమీపలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి కర్రతో ప్రవేశించాడు. అనంతరం ఏటీఎంపై దాడి చేయగా, అలారంతో అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. తక్షణమే రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఫుట్పాత్పై నివసించే వేణు నందు.. మద్యం మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

