IND vs AUS: సిడ్నీ వన్డేలో ఇండియా ఛేజింగ్.. తుది జట్టులోకి కుల్దీప్, ప్రసిద్

IND vs AUS: సిడ్నీ వన్డేలో ఇండియా ఛేజింగ్.. తుది జట్టులోకి కుల్దీప్, ప్రసిద్

ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం (అక్టోబర్ 25) మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ వచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. బార్ట్ లెట్ స్థానంలో ఎల్లిస్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు.

తొలి వన్డేలో బ్యాటర్లు ఫెయిల్. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బౌలర్లు చేతులెత్తేశారు. ఇప్పటికే సిరీస్ పోయింది. మరోసారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ ఎదురవుతుంది. దాన్ని తప్పించుకోవాలన్నా.. వన్డే కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్ ప్రయాణం ఘోర పరాభవంతో మొదలవకూడదన్నా.. శనివారం (అక్టోబర్ 25) సిడ్నీలో జరిగే ఆఖరి, మూడో వన్డేలో టీమిండియా నెగ్గాల్సిందే.  

భారత్ (ప్లేయింగ్ XI): 

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్