ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. గురువారం (నవంబర్ 6) క్వీన్స్ల్యాండ్ లో కర్రారా ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్ లో ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. జంపా, మాక్స్వెల్, ఫిలిప్, డ్వార్షియస్ తుది జట్టులో స్థానం సంపాదించారు.
ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్ లు ముగిస్తే 1-1 తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరిగితే ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయంసాధించి 1-1 తో సమం చేసింది.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా
భారత్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
