తప్పతాగి స్కూలు పిల్లల ఆటో నడిపిన డ్రైవర్ : పోలీసులు షాక్

తప్పతాగి స్కూలు పిల్లల ఆటో నడిపిన డ్రైవర్ : పోలీసులు షాక్

స్కూలు పిల్లలను ఇళ్లకు చేరవేస్తున్న టైమ్ లో ఓ ఆటో డ్రైవర్ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ తో అతన్ని చెక్ చేసినప్పుడు.. ఏకంగా 359 పాయింట్లు చూపెట్టింది. దీంతో.. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

నార్త్ జోన్ సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ వెంకట్ రమణ ఆధ్వర్యంలో  క్లాక్ టవర్ దగ్గర డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఆటోలో విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఆటో డ్రైవర్  బ్రీత్ చెక్ చేశారు. అతను అతిగా మద్యం తాగినట్టు గుర్తించారు. వెంటనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను వారి ఇంటి వద్ద వదిలి వేశారు పోలీసులు.