నర్సాపూర్‌‌లో గడప గడపకు కాంగ్రెస్

నర్సాపూర్‌‌లో గడప గడపకు కాంగ్రెస్
  •     అభ్యర్థి రాజిరెడ్డి, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్​ ప్రచారం

నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు : బీఆర్‌‌ఎస్​ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్​ నర్సాపూర్​ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన, సీడబ్లసీ మెంబర్​, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌తో కలిసి మెదక్​ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌ఎస్​లీడర్లు భూకబ్జాలు చేసి ధనవంతులయ్యారని ఆరోపించారు.

ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రచారంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, సీనియర్​ నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డి, మార్కెట్​ కమిటీ మాజీ చైర్మెన్​ హంసిబాయి, పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

నేడు రేవంత్​రెడ్డి బహిరంగ సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు నర్సాపూర్​ పట్టణంలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటుచేసినట్టు రాజిరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పార్టీ లీడర్లతో కలిసి రేవంత్ రెడ్డి సభా స్థలివద్ద ఏర్పాట్లను పరిశీలించారు.