ఖాజాపూర్​లో కుల నిర్మూలన సదస్సు : బోధన్ ​డివిజన్ ​కార్యదర్శి బి.మల్లేశ్

ఖాజాపూర్​లో కుల నిర్మూలన సదస్సు : బోధన్ ​డివిజన్ ​కార్యదర్శి బి.మల్లేశ్

బోధన్, వెలుగు: కులవ్యవస్థను నిర్మూలించినప్పుడే  దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా బోధన్ ​డివిజన్ ​కార్యదర్శి బి.మల్లేశ్ ​పేర్కొన్నారు. శుక్రవారం సాలూర ​మండలం ఖజాపూర్​గ్రామంలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా మల్లేశ్​ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు సైతం కులాలు, మతాలకు అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సత్యశోధక్​సమాజ్​ఏర్పడి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కుల నిర్మూలన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా జ్యోతిబాఫులే ఎనలేని కృషి చేశారన్నారు. సాలూర మండల కార్యదర్శి పడాల శంకర్, లీడర్లు సీహెచ్​గంగయ్య, లక్ష్మీబాయి, గంగారాం, మారుతి, భీమ్​రావ్, నర్సింలు, లక్ష్మీ, నర్సుబాయి, పీరాజీ పాల్గొన్నారు.