వడ్లు కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన..కామారెడ్డి  ఐకేపీ అధికారులపై ఆగ్రహం

వడ్లు కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన..కామారెడ్డి  ఐకేపీ అధికారులపై ఆగ్రహం

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలోని తిమ్మక్​పల్లి(కె)లో  కొనుగోలు సెంటర్​కు వడ్లను తీసుకొచ్చి 3 వారాలు దాటినా ఇంకా కాంట పెట్టకపోవటాన్ని నిరసిస్తూ శనివారం రైతులు ఆందోళనకు దిగారు. రోజులు గడుస్తున్నప్పటికీ కాంటాలు పెట్టకపోవడంపై రైతులు సెంటర్​వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఆర్​డీవో సురేందర్,  ఐకేపీ అధికారులు అక్కడికి చేరుకోగా వారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో కాంటాలు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇవ్వడంలో రైతులు శాంతించారు. 

ఆర్మూర్​లో రైతుల రాస్తారోకో

ఆర్మూర్, వెలుగు: వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​మున్సిపల్​పరిధిలోని పెర్కిట్​ లో నేషనల్​హైవేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పెర్కిట్ సొసైటీ పరిధిలో కొనుగోలు లో కాంటా వేయడం లేదని మండిపడ్డారు.

ట్రాఫిక్ ​నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ ఫోన్​లో అధికారులతో మాట్లాడించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.