ఇండిపెండెన్స్ డే రోజు డబుల్ ట్రీట్.. క్రికెట్, హాకీ మ్యాచ్లతో ఫ్యాన్స్కు పండగే

ఇండిపెండెన్స్ డే రోజు  డబుల్ ట్రీట్.. క్రికెట్, హాకీ మ్యాచ్లతో ఫ్యాన్స్కు పండగే

2026 ఆగస్టు 15.. ఇండిపెండెన్స్ డే క్రీడాభిమానులకు మెమరబుల్ డే గా నిలవనుంది.  ఎందుకంటే ఆ రోజు ఇండియన్ టీమ్స్  రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పోటీపడనుంది.  అత్యంత ప్రాముఖ్యమైన రోజు కావడంతో..  ఈ రోజు జరిగే మ్యాచులలో గెలిచి ఫ్యా్న్స్ కు ట్రీట్ ఇవ్వాలని అటు టీమిండియా క్రికెట్ జట్టు, ఇటు హాకీ టీమ్ సిద్ధమవుతున్నాయి. 

స్వాతంత్ర్య దినోత్సవం రోజు అతిపెద్ద అట్రాక్షన్ గా ఇండియా-శ్రీలంక టెస్టు మ్యాచ్ నిలవనుంది. ఇప్పటికే కాంటెస్ట్ ఇరు జట్ల మధ్య  కీలక దశకు చేరుకుంది.  చాలా రోజు తర్వాత జరిగే తీవ్రమైన పోటీలో..  'మెన్ ఇన్ బ్లూ'  మ్యాచ్‌పై పట్టు సాధించి, సిరీస్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తుంది.

 విదేశాల్లో మరో చిరస్మరణీయ టెస్ట్ ప్రదర్శన కోసం భారత్ ప్రయత్నిస్తున్నందున, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

 మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు వేల్స్‌తో  FIH హాకీ ప్రపంచ కప్ 2026 క్యాంపెయిన్ ను ప్రారంభించనుండటంతో  అందరి దృష్టి హాకీ వైపు ఉంది.  ఇటీవలి కాలంలో టీమ్  కనబరుస్తున్న నిలకడైన ప్రదర్శనల కారణంగా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

 ఈ పోరుతో చారిత్రాత్మక ప్రపంచ కప్ టైటిల్ కోసం ఇండియా  చేసే అన్వేషణ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరుగుతుండటంతో దీనికి మరింత ప్రాముఖ్యత చేకూరింది.  ఇది ప్లేయర్స్ కు, సపోర్టర్స్ కు ఒక ఎమోషనల్ ఈవెంట్ గా నిలవనుంది.  

క్రికెట్, హాకీ రెండూ ఒకేసారి ప్రధాన ఆకర్షణగా నిలవడంతో, ఆగస్టు 15 భారతదేశ క్రీడా క్యాలెండర్‌లో అత్యంత బిజీగా ఉండే రోజుల్లో ఒకటిగా నిలవనుంది. జాతీయ జట్లు ఈ సందర్భాన్ని విజయాలతో ముగించాలని..  త్రివర్ణ పతాకానికి సరైన నివాళిని అర్పిస్తాయని లక్షలాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.