- దుండిగల్లో ప్రమాదం
- బీటెక్ స్టూడెంట్ మృతి
కుత్బుల్లాపూర్ ,వెలుగు: బైక్ పై వెళ్తున్న స్టూడెంట్ ను అతడు చదువుతున్న కాలేజీకి చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో బుధవారం ఉదయం జరిగింది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం..కడపకి చెందిన ఎన్.వీరేశ్ రెడ్డి(20) చింతల్ లోని తన మేనమామ దగ్గర ఉంటూ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం తన బైక్ పై ఫ్రెండ్ ఏలూరు ప్రవీణ్తో కలిసి కాలేజీకి బయలుదేరాడు. గండిమైసమ్మ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వీరేశ్బైక్ ను నెమ్మదిగా వెళ్లనిచ్చాడు. ఈ సమయంలో వెనుకనుంచి వేగంగా వచ్చిన అదే కాలేజీకి చెందిన బస్సు వీరేశ్బైక్ ని ఢీకొట్టింది. ప్రమాదంలో కిందపడిన వీరేశ్తలపై నుంచి బస్సు ముందు టైర్ వెళ్లింది. వెంటనే వీరేశ్ను మల్లారెడ్డి హాస్పిటల్ కి తరలించగా..అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే వీరేశ్ రెడ్డి చనిపోయాడంటూ అతడి మేనమామ దుండిగల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు వీరేశ్డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.