ఇవాళ్టితో మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం

ఇవాళ్టితో మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం

హిమాలయ పర్వతాల్లో కొలువైన బద్రీనాథుని ఆలయం ఇవాళ్టితో మూతపడనుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తూ ఉండటం, వచ్చే ఆరు నెలల పాటు ఆలయం పూర్తిగా మంచులో కూరుకుపోనుంది. దీంతో ఈ సాయంత్రం సంప్రదాయ పూజల తర్వాత ఆలయాన్ని పూజారులు మూసివేయనున్నారు. తిరిగి వచ్చే ఏడాది వేసవి ప్రారంభమైన తర్వాత ఆలయం తలుపులు తెరుస్తారు. ఇవాళ సాయంత్రం వెలిగించే అఖండ జ్యోత… ఈ ఆరు నెలలూ గర్భగుడిలో వెలుగుతూనే ఉంటుంది. దీన్ని బద్రీనాథుని మహిమగా భక్తులు నమ్ముతుంటారు. సీజన్ చివరి రోజు కావడంతో ఇవాళ(ఆదివారం) స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.