న్యూఢిల్లీ: బాయ్ హీరాబాయ్ ట్రస్ట్ బోర్డులో కేవలం జోరాస్ట్రియన్స్ మాత్రమే ట్రస్టీలుగా ఉండాలన్న రూల్ను సవరించేందుకు టాటా ట్రస్ట్స్ సిద్ధమైంది. మాజీ ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ, పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్, మాజీ డిఫెన్స్ సెక్రెటరీ విజయ్ సింఘ్ నియామకాలను మహారాష్ట్ర చారిటీ కమిషనర్ వద్ద సవాలు చేసిన విషయం తెలిసిందే.
వీరు ట్రస్ట్ డీడ్లో ఉన్న ప్రమాణాలను చేరుకోలేదని, పార్సీ జోరాస్ట్రియన్స్ కారని ఆయన వాదించారు. ఈ నెల 17న నోయల్ టాటా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్టీలు బాయ్ హీరాబాయ్ ట్రస్ట్ కార్యకలాపాలను సమీక్షించారు.

