జోరుమీదున్న ఇంగ్లండ్ : బెయిర్ స్టో సెంచరీ

జోరుమీదున్న ఇంగ్లండ్ : బెయిర్ స్టో సెంచరీ

బర్మింగ్‌ హామ్ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా ఆడుతోంది. ఓపెనర్ బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు. 85 బాల్స్ లో 6 సిక్సులు, 8 ఫోర్లతో 100 కొట్టిన బెయిర్ స్టో ..అదే జోరును కొనసాగిస్తున్నాడు.

టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు రాణించడంతో 160 స్కోర్ దాక వికెట్ పడలేదు. 23 వ ఓవర్ లో జాసన్ రాయ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు బెయిర్ స్టో.

26 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 183. బెయిర్ స్టో(100), జో రూట్(12) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

కుల్దీప్ యాదవ్ కు 1 వికెట్ దక్కింది.