
హైదరాబాద్: గోవధను అడ్డుకోవాలంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. దీంతో భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. అయినా విడతల వారీగా ప్రగతి భవన్ ముట్టడికి భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించారు. రెండు విడుతలుగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చారు. అయితే అలర్ట్ అయిన పోలీసులు.. కొందర్ని ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరనే అడ్డుకొని షహనాజ్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో విడతగా భజరంగ్ దళ్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ గేటు దగ్గరకు రాగా.. పోలీసులు వాళ్లను కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.