ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా VHP ఆందోళనలు

ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా VHP ఆందోళనలు

సిద్దిపేట జిల్లా చేర్యాలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా  విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ బంద్ కు పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం నుంచే పట్టణంలోని అన్ని షాపులను మూసేశారు వ్యాపారులు.  ఎమ్మెల్యే రాజాసింగ్ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని..వెంటనే విడుదల చేయాలని బజరంగ్ దళ్, విశ్వహిందు కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్  జిల్లా చాందాటిలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా అభిమానులు నిర్వహించిన శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.  ఆందోళకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కేంద్రంలో భజ్ రంగ్ దళ్ ప్రభుత్వ  దిష్టిబొమ్మను ద్వంసం చేసింది. హిందువులకు మైనారిటీలకు వేర్వేరుగా  న్యాయం చేస్తున్నారని ఆరోపించారు.