మూసాపేట, వెలుగు : డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా కార్పొరేటర్ పట్టించుకోవడం లేదంటూ ఫొటోతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. బాలాజీనగర్ డివిజన్ కేపీ హెచ్బీ కాలనీ రోడ్ నం.3 ఎల్ఐజీ 536 వద్ద కొన్నిరోజులుగా డ్రైనేజి పొంగిపొర్లుతోంది. స్థానిక ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ శిరీషకు, అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ మంగళవారం డ్రైనేజీ వద్ద కార్పొరేటర్ ఫొటోతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు.
వర్షాలతో కాలనీలో నీరు నిలిచి డ్రైనేజీలు పొంగుతూ జనం ఇబ్బంది పడుతున్నా ఎన్నడూ కార్పొరేటర్ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పటోళ్ల సాయినాథ్ రెడ్డి, బాలాజినగర్ డివిజన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ గౌడ్ తదితరులు
ఉన్నారు.