నందమూరి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వారసుడి ఎంట్రీకి మాస్ డైరెక్టర్ ఫిక్స్

నందమూరి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వారసుడి ఎంట్రీకి మాస్ డైరెక్టర్ ఫిక్స్

నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మీరందరూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బాలకృష్ణ(Balakrishna) వారసుడు నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం టాలీవుడ్  మాస్ డైరెక్టర్ ను ఫిక్స్ చేశారట. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలకృష్ణ అంటే మాస్ చిత్రాలకు కేరాఫ్. ఆయన సినిమాల్లో భారీ ఫైట్స్ అండ్ మాస్ డైలాగ్స్ ఉంటాయి. అలాంటి మాస్ హీరోను సైతం స్టైలీష్ గా ప్రెజెంట్ చేసి, రెగ్యులర్ మాస్ డైలాగ్స్ కాకుండా వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ ను ఆయనతో చెప్పించి ఆడియన్స్ ను మెప్పించిన దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీ పైసా వసూల్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దీంతో బాలకృష్ణతో మరో సినిమా చేస్తానని అప్పుడే ప్రకటించాడు దర్శకుడు పూరి జగన్నాధ్. అప్పటి నుండి ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. 

అయితే తాజా సమాచారం బాలకృష్ణ తన సినిమా కంటే పెద్ద భాద్యత పెట్టాడట పూరి జగన్నాధ్ పై. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాను పూరినే డైరెక్ట్ చేయాలని చెప్పారట. ఈ ప్రాజెక్టు కు సంబందించిన చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తోంది. ఇందుకోసం మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను రెడీ చేయబోతున్నారట పూరి. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్త తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.