కొనసాగుతున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర

కొనసాగుతున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జానికి సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు సాగనున్న ఈ 21 కిలో మీటర్ల శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు ఉదయం 5 గంటలకు చివరి పూజలు చేసిన బాలాపూర్ ఆలయ నిర్వాహకులు... శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ వినాయకుడి శోభాయాత్ర బాలాపూర్ నుండి మదీనా, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా జరగనుంది. ప్రతి ఏడాది లాగే ఈ యేడూ లడ్డూ వేలం ప్రక్రియను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు.