దళిత, గిరిజన మైనార్టీలపై దాడులను వెంటనే ఆపాలి

దళిత, గిరిజన మైనార్టీలపై దాడులను వెంటనే ఆపాలి
  • బంధు సొసైటీ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: షెడ్యూల్ కులాలు, గిరిజనులు, మైనార్టీలపై జరిగే అన్ని రకాల దాడులను వెంటనే ఆపాలని బంధు సొసైటీ డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధుసొసైటీ ఆధ్వర్యంలో కారంచేడు, చుండూరు, లక్ష్మిపేట మృతవీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథలుగా రైల్వే రిటైర్డ్ సీఎంఈ దార్ల పోతురాజు, అప్పికట్ల భరత్ భూషణ్, సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీరాస్వామి హాజరై మాట్లాడారు. 

మణిపూర్ లో ఆదివాసీలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై సీబీఐతో దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్, హర్యానాలో శాంతి సామరస్యాలను వెంటనే నెలకొల్పాలని కోరారు. దేశంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, అల్లర్లు జరిగితే బలహీనత కూడా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎర్ర దేవదానం, నర్సింగ్ రావు, ప్రొఫెసర్ నతానియేల్  , కామేశ్వరరావు, రాంబాబు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.