
ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్లనే మర మనిషి అంటారన్నారు. హామీలను అమలు చేయలేని వాళ్లను మర మనిషి అనడం తప్పా అని ప్రశ్నించారు. అసెంబ్లీ బయట మరమనిషి అన్నందుకే అంత కోపం వస్తే అసెంబ్లీలో దేశ ప్రధానిని ఫాసిస్టు ప్రధాని అంటే మాకు కోపం రాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట రాజకీయాలను చర్చిస్తున్న కేసీఆర్ ను ఏమనాలన్నారు. ఫాసిస్టు ప్రధాని అన్న కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని.. ప్రజలే బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తమ ఎమ్మెల్యేని ఇప్పటికే ఒకరిని జైలుకు పంపించారని.. ఇప్పుడు మరో ఎమ్మెల్యేని సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. ఆర్టీసీ ఆస్తులను 99 ఏళ్ల పాటు లీజుకిచ్చి లబ్ది పొందే కుట్రకు తెర లేపారన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు.