కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు : బండి సంజయ్

కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు : బండి సంజయ్

జగిత్యాల : రాష్ట్రంలో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చిచ్చుపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. గిరిజనులు అడగకముందే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చేయలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లబ్ధిదారులకు మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వర్షాలకు కురుస్తూ, కూలడానికి సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. 

5వ విడత ప్రజా సంగ్రామ  పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. ఈ సభకు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.