ఫాంహౌస్ కేసులో కేసీఆర్ను సాక్షిగా విచారించాలి : బండి సంజయ్

ఫాంహౌస్ కేసులో కేసీఆర్ను సాక్షిగా విచారించాలి : బండి సంజయ్

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సీఎం కేసీఆర్ను సాక్షిగా విచారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిందితులు, ఫిర్యాదుదారులు, కోర్టులు చెప్పాల్సింది కూడా కేసీఆరే చెప్తున్నారని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. సిట్ విచారణతో ఒరిగేదేమిలేదని..సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బీజేపీ ఉందని కేసీఆరే చెప్పారని.. అందుకే కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

ప్రధానిని రాష్ట్రానికి రావొద్దనడానికి కారణమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని ప్రోగాంకు రాలేక ఆహ్వానంపై అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని పర్యటనపై రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం ఎలాగూ రైతులకు న్యాయం చేస్తలేడని.. ఆర్ఎఫ్సీఎల్ తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూంలు ఇచ్చారని అడిగారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు.